కార్తీకపురాణం మూడవ అధ్యాయము
ఓం శ్రీగురుభ్యోనమః ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః "కార్తీకపురాణం మూడవ అధ్యాయము" కార్తీక మాస స్నాన మహిమ:- జనక మహరాజా ! కార్తిక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై ,దానము చేసిన వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము "శివ సాన్నిధ్యమును" చేరుదురు. కానీ, కొంత మంది ఆశాశ్వతములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి,కుక్క,పిల్లులుగా జన్మింతురు.కనీసము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజునైననూ స్నాన, దాన, జపతపాదులు, చేయక పోవుట వలన అనేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన ఒక ఇతిహాసం వినిపించెదను.సపరి వారముగా శ్రద్దగా వినుడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట:- ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపఃశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు"తత్వనిష్టుడు" అను బ్రాహ్మణుడు ఉండెను ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలు ద...
Comments
Post a Comment